TPT: జిల్లాలోని దొరవారిసత్రం మండలం పాలింపాడులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభంపై పని చేస్తుండగా ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లైన్లో విద్యుత్ సరఫరా ఉండటమే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
విద్యుదాఘాతంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి


