PLD: వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. ఇప్పటికే నిధులు మంజూరైన మంచినీటి పథకాలకు టీడీపీ నాయకులు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేయడం వింతగా ఉందని విమర్శించారు. పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఏం చేసినా ప్రజలకు మంచినీరు అందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మళ్లీ శంకుస్థాపనలు చేయడం వింతగా ఉంది'


