హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్

కృష్ణా: గూడూరు మండలంలోని కప్పలదొడ్డి గ్రామ సచివాలయం సమీపంలో మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి అధికారులు మరమ్మతులు చేపట్టారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు కొంత సమయం పడుతుందని గూడూరు విద్యుత్‌ శాఖ ఏఈ ఎం.రాజేష్‌కుమార్ తెలిపారు.