PPM: గుమ్మలక్ష్మీపురం మండలం జంగిభద నుంచి కప్పకల్లుకు గ్రామానికి వెళ్లే రహదారి దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షాలకు మట్టి కొట్టుకుపోయి రాళ్లు బయటపడటంతో నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లేందుకు, అటవీ ఉత్పత్తులు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి కాదు.. రాళ్ల బాట! గిరిజనుల అవస్థలు


