హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

విజయనగరం మండల పరిషత్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను వేయాలని సూచించారు. అలాగే, రైతులకు అవసరమైన సహకారం అందించేలా చర్యలు చేపట్టడం గురించి అధికారులతో చర్చించారు.