హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్యకు కుట్ర.. ముగ్గురిపై కేసు

అన్నమయ్య: వీరబల్లి మండలం ఓదివీడులో ఖాసీం హత్య పథకం ప్రకారమే జరిగిందని సుండుపల్లి సీఐ సురేష్‌రెడ్డి, ఎస్సై సుస్మిత తెలిపారు. కువైట్‌లో ఉన్న నాగిన్‌బాషా కుట్ర పన్ని ఇద్దరితో హత్య చేయించినట్లు పేర్కొన్నారు. ఘటనలో షేక్ హుసేన్‌బాషా అలియాస్ బాడ్జీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.