హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడి

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆఫీస్‌పై దాడి జరిగింది. కోల్‌కతా కామాక్ స్ట్రీట్‌లో ఉన్న తన కార్యాలయంపై దుండగులు దాడి చేసినట్లు అభిషేక్ తెలిపారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలు, టెలివిజన్ ధ్వంసమైనట్లు చెప్పారు. ఈ దాడి వెనక బీజేపీ కార్యకర్తల హస్తం ఉందని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫోన్లు, ఈమెయిల్స్ చేసిన రెండు గంటల పాటు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.