హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌పై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు

VSP: జగన్‌పై మంత్రి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు క్రెడిట్ చోరీ వ్యాధి బాగా ముదిరిపోయిందని, వైద్యుడు కూడా లేని ఇలాంటి వ్యాధికి మొదటి రోగి జగనే అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏం చేసినా తనదే ఘనతంటారని సంధ్యారాణి అన్నారు. జగన్‌ క్రెడిట్‌ ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం, తాకట్టు పెట్టడం, విధ్వంసం చేయడమేనని మంత్రి విమర్శించారు.