హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైలార్‌దేవ్‌పల్లిలో ఆటో డ్రైవర్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జహంగీరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ రవూఫ్‌ను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.