MHBD: కేసముద్రం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబాబాద్కు పట్టానికి చెందిన వరంశెట్టి దీపక్ (22) గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ
గూడ్స్ రైలు కిందపడి యువకుడి మృతి


