హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. రాజధానిలో రూ.596 కోట్లతో సెంట్రల్‌ లైబ్రరీ, కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.533 కోట్లు కేటాయించే ప్రతిపాదనపైనా చర్చిస్తారు. బీటీ రోడ్లు, తాగునీటి సరఫరా అంశాలపై కూడా కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.