హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవం

అన్నమయ్య: మదనపల్లె ప్రెస్ క్లబ్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి, సలహాదారుగా సిరివేలు చరణ్‌కుమార్, అధ్యక్షులుగా నక్కింటి రవీంద్ర, కార్యదర్శిగా మోడెం శ్రీనివాసరావు, కోశాధికారిగా నానబాల కుమార్ ఎన్నికయ్యారు. పాత్రికేయుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపింది.