హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌

KDP: సెప్టెంబర్‌ 12న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌పై ఉమ్మడి కడప జిల్లా మండల స్థాయి న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. రామ గోపాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాలను కూడా లోక్‌ అదాలత్‌లో సెటిల్‌ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.