హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప డీటీసీలో నూతన వేదిక ప్రారంభించిన ఎస్పీ

కడప జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఆధునీకరించిన కంప్యూటర్ ల్యాబ్, నూతన వేదికను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. ఆధునిక పోలీసింగ్‌కు అనుగుణంగా సాంకేతిక, వృత్తి నైపుణ్యాలతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. తొమ్మిది నెలలుగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్న డీటీసీ బృందాన్ని అభినందించారు.