హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడిని తప్పించబోయి ప్రమాదం

BPT: పర్చూరు వైఆర్ హైస్కూల్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎంపీపీఎస్ స్కూల్ ఎస్జీటీ రవీంద్రబాబు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. విధులకు వెళ్తుండగా ఓ బాలుడిని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రుడిని పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.