హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి’

GNTR: గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో పెండింగ్‌ అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జీఎంసీ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం చౌడవరం, జూనం చుండూరు, పొత్తూరు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తాగునీరు, వీధిదీపాలు, రహదారులు, డ్రైనేజీ, శ్మశానవాటికలపై వార్డుల వారీగా వివరాలు సేకరించాలని సూచించారు.