హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎయిడ్స్‌, నేత్రదానం, టీబీపై విద్యార్థులకు అవగాహన

అన్నమయ్య: జ్యోతిరావ్ ఫూలే జూనియర్ కళాశాలలో ఎయిడ్స్‌ సురక్ష, నేత్రదానం, టీబీ ముక్త్‌ భారత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ హెచ్‌ఈవో మహమ్మద్‌ రఫీ మాట్లాడుతూ.. 95-95-99 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. నేత్రదానం ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.