హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలాకి సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత

SKLM: పోలాకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జడ్పీ నిధుల పనులకు పంచాయతీ తీర్మానాలు ఇవ్వకపోవడంపై జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం 48 గంటల్లో తీర్మానాలు ఇప్పిస్తామని ఇంఛార్జ్ ఎంపీడీవో బలగ ప్రకాష్ హామీ ఇచ్చారు.