AKP: కురుపాం మండలంలోని చిడిమానుగూడ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలు కష్టంగా మారుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి కోసం అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు సౌకర్యం కల్పించాలి'


