హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

JGL: ఈనెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ కోరారు. మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పోలీసులు, మీడియేషన్ కోఆర్డినేటర్లతో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ సంఖ్యలో కేసుల పరిష్కారానికి పోలీసులు, న్యాయవాదులు సహకరించాలని సూచించారు.