హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాలలో వైసీపీకి షాక్..!

PLD: గురజాలలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ జానీబాషా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పార్టీ కండువాను కప్పి జానీబాషాను పార్టీలోకి ఆహ్వానించారు. ఛైర్మన్‌‌తో పాటు ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో గురజాలలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.