హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో రూ.6.21 కోట్ల పెన్షన్లు: కమిషనర్

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 14,094 మంది లబ్ధిదారులకు రూ.6.21 కోట్ల పెన్షన్‌ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. మంగళవారం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్‌ మొత్తాన్ని అందజేస్తున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.