హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన'

NLG: దేవరకొండ మండలం కొమ్మేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1ను ప్రతి సంవత్సరం పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తామని ఉపాధ్యాయులు ప్రేమయ్య, తార, రవీందర్ తెలిపారు.