HYD: మియాపూర్లోని సుభాష్ చంద్రబోస్ నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల మల్లికార్జున్ చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో సోమవారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న బాలుడు మృతి చెందడంతో సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పదో తరగతి విద్యార్థి మృతి


