హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు గల్లంతుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఖమ్మం మున్సిపాలిటీ 11వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సరిపూడి రమాదేవి ఓటు ముసాయిదా జాబితాలో గల్లంతైంది. ఈ విషయంపై మంగళవారం కలెక్టర్‌ దివాకర టీఎస్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రముఖుల ఓట్లను పరిశీలించాల్సిన సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన ఓటు జాబితాలో లేకుండా పోయిందని ఆరోపించారు.