హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘పెన్షన్ విద్రోహ దినం’

NZB: అపరిష్కృత సమస్యలపై ఉద్యోగులు నిరసన గళం విప్పారు. టీజీఈజేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ‘పెన్షన్​ విద్రోహ దినం’ను నిర్వహించారు. కోటగల్లిలోని శంకర్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీని మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.