HYD: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ABVP ఆధ్వర్యంలో విద్యార్థులు తలసానిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, దీంతో విద్యార్థులకుసర్టిఫికెట్లు అందడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ
'ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి'


