హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన కార్మికులకు మెడికల్ అన్‌ఫిట్ చేయాలి'

BDK: మణుగూరు మండలంలో మంగళవారం టీబీజీకేఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాగెల్లి వెంకట్‌ మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన సింగరేణి కార్మికులను మెడికల్‌ అన్‌ఫిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల మూడు మెడికల్‌ బోర్డులు నిర్వహించాలని కోరారు. అనంతరం గనుల్లో టీబీజీకేఎస్‌ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.