హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే అండర్‌పాస్‌లో నీరు.. ప్రయాణికుల అవస్థలు

MBNR: రాజాపూర్ మండల కేంద్రం నుంచి తండాలకు వెళ్లే మార్గంలోని రైల్వే అండర్‌పాస్‌లో చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలుస్తోంది. దీంతో మోత్కులకుంట, వాచ్య, మర్రిబాయి, లక్ష్మణ్ నాయక్ తండాల ప్రజలు, రైతులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.