హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి: ఎంపీ

MBNR: అరాచక సంస్కృతిని కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. BJP రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని పిరికిపంద చర్యగా ఆమె ఖండించారు. రాజ్యాంగ ప్రతిని చేతబట్టి నీతులు చెప్పే ‘డూప్లికేట్ గాంధీ’ ఈ దాడిపై స్పందించాలని డిమాండ్ చేశారు.