హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూములు కోల్పోయిన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలి'

NZB: కొటార్మూర్ గ్రామంలో సర్వే నంబర్ 160లో భూములు కోల్పోయిన పట్టాదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియకు సోమవారం వినతిపత్రం అందజేశారు. భూములు కోల్పోయిన అసలైన పట్టాదారులను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.