హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీ చేసి.. అన్నం తిని వెళ్లిన దొంగ

AKP: నర్సీపట్నంలో విచిత్రమైన చోరీ ఘటన వెలుగు చూసింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు గ్రంధి వెంకట కృష్ణ దంపతులు ఇంట్లోలేని సమయంలో దొంగ చొరబడ్డారు. 10 తులాల వెండి వస్తువులను అపహరించాడు. వంట గదిలోకి వెళ్లి కుక్కర్లోని అన్నం, పెరుగు తినేశాడు. ఇంటికి వచ్చిన బాధితులు చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.