హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పులివెందులకు జగన్

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇవాళ పులివెందులకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్న ఆయన.. రాత్రికి అక్కడి తన నివాసంలో బస చేస్తారు. ఎల్లుండి ఇడుపులపాయలో జరిగే దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో జగన్‌ పాల్గొంటారు. అనంతరం వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద తండ్రికి నివాళులర్పించనున్నారు.