హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఫిర్యాదుకు చట్టబద్ధ పరిష్కారం

GNTR: ప్రజల సమస్యలకు సత్వర, చట్టబద్ధ పరిష్కారం చూపుతూ.. వారి విశ్వాసాన్ని నిలబెట్టాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 155 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా విచారణ జరిపి నిర్ణీత గడువులో నివేదిక అందించాలని సూచించారు.