హైదరాబాద్: 28°C
వార్తలు

విరిగిపడ్డ కొండచరియలు.. నిలిచిన రాకపోకలు

హిమాచల్‌ప్రదేశ్ కులు జిల్లాలోని నిరమండ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భాగిపుల్-జావో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 200 మీటర్ల మేర రోడ్డు ధ్వంసమైంది. యంత్రాంగం వెంటనే స్పందించి రహదారి పునరుద్ధరణ చర్యలను ముమ్మరంగా చేపట్టింది. వర్షం లేకపోయినా హఠాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.