GNTR: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైదర్గూడ అపోలో ఆస్పత్రిలో గుండెకు చికిత్స చేయించుకున్నారు. రొటీన్ చెకప్లో రెండు చోట్ల బ్లాకేజీలు గుర్తించడంతో ఆగస్టు 28న PTCA, కొరోనరీ స్టెంటింగ్ నిర్వహించారు. చికిత్స అనంతరం కోలుకున్న ఆయనను సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంబటి రాంబాబుకు విజయవంతంగా గుండె చికిత్స


