హైదరాబాద్: 28°C
వార్తలు

భారత అమ్ములపొదిలోకి మరో 5 ఎస్‌-400లు

భారత గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు మరో 5 S-400 'సుదర్శన్‌' క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు రంగం సిద్ధమైంది. భారత్‌ టెండర్‌కు స్పందించిన రష్యా.. రూ.50 వేల కోట్ల ప్రతిపాదనను రక్షణ శాఖకు సమర్పించింది. పాత ఒప్పందంలోని చివరి స్క్వాడ్రన్‌ నవంబరులో రానుండగా, కొత్త ఒప్పందం కుదిరితే డెలివరీకి 3 ఏళ్లు పడుతుంది. వీటిని తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో మోహరించనున్నారు.