హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు క్వింటా రూ.15,450

GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పసుపు వర్తకం లాభదాయకంగా సాగింది. గరిష్ఠ ధర క్వింటాకు రూ.15,450 వరకు నమోదు కాగా, కనీస ధర రూ.10,300గా నమోదైంది. కొమ్ము రకంలో టాప్ క్వాలిటీ రూ.15,450, మీడియం రూ.15,050 పలకగా.. కాయ రకంలో ఉత్తమ రకం రూ.15,300, మీడియం రూ.15,050 వరకు విక్రయాలు జరిగినట్లు యార్డు వర్గాలు వెల్లడించాయి.