హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీరు విడుదలకు గేట్లు ఏర్పాటు

అనకాపల్లి: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించే గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు పాయకరావుపేట వద్ద 2న జలహారతి ఇవ్వనున్నారు. 111,150 కి.మీ. వద్ద ఏర్పాటు చేసిన క్రాస్‌ రెగ్యులేటర్‌లో ఆరు గేట్లు సిద్ధం చేస్తున్నారు. సీఎం తొలుత రెండు గేట్లను ఆపరేట్‌ చేసి జిల్లాకు నీటిని విడుదల చేయనున్నారు. రెగ్యులేటర్‌ వద్ద 2-2.5 మీటర్ల మేర నీటిని నిల్వ చేస్తారు.