హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జప్తు చేసిన వాహనాలకు బహిరంగ వేలం

KMR: బాన్సువాడలోని మధ్య నిషేధ, అబ్కారీ స్టేషన్ పరిధిలో జప్తు చేసిన అశోక్ లేలాండ్ వాహనానికి రేపు బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. వాహనం ప్రారంభ ధర రూ.1.95 లక్షలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు వాహనం ప్రారంభ వేలం ధరలో 25%(రూ.48,750) ధరావత్తుగా చెల్లించి ఎంట్రీ పాస్ పొందాల్సి ఉంటుందన్నారు.