హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: విజయవాడ మధురానగర్ సెక్షన్ 11 కేవీ పద్మావతి ఫీడర్ పరిధిలో నూతన విద్యుత్ లైన్ల నిర్మాణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ కె.వై కొండలరావు తెలిపారు. దేవినగర్ ఐదో లైను నుంచి 8వ లైన్ వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.