హైదరాబాద్: 28°C
తెలంగాణ

రత్నావతి సేవలు చిరస్మరణీయం

MLG: వెంకటాపురం మండలం పాత్రాపురం పాఠశాలలో ఆదివారం టీచర్ కర్రి రత్నావతి ఉద్యోగ విరమణ సన్మాన సభ నిర్వహించారు. విద్యా బోధనే జీవిత ధ్యేయంగా, విద్యార్థుల భవితవ్యమే పరమావధిగా పనిచేసిన రత్నావతి సేవలను మండల విద్యాధికారి సత్యనారాయణ, పీఏసీఎస్ ఛైర్మన్ చిడెం మోహన్‌రావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు పాల్గొన్నారు.