ASF: బెజ్జార్ మండలం సుస్మీర్ గ్రామ శివారులో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 41 పశువులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోలు చేసి జగిత్యాల స్లాటరింగ్ మార్కెట్కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తెలంగాణ
VIDEO: పశువులను తరలిస్తున్న ఆరుగురి అరెస్ట్


