ప్రకాశం: కంభం పట్టణంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాయిబాబా ఆలయం నుంచి అంకాలమ్మ తిప్ప వరకు మహిళలు, భక్తులు బోనాలు తీసుకుని ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
బోనమెత్తిన ఎమ్మెల్యే


