హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న BCCI వైస్‌ ప్రెసిడెంట్

తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో BCCI వైస్‌ ప్రెసిడెంట్ రాజీవ్‌ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగవంతుని దయతో కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభించిందన్నారు. నిన్న శ్రీకాళహస్తి, మోహన్‌బాబు యూనివర్సిటీలో కార్యక్రమాలకు హాజరైనట్లు తెలిపారు.