VZM: బొండపల్లి మండలం గొల్లుపాలెం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల సమీపంలోని కాలువలో మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, దుర్వాసనతో పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మురుగునీటిని తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల పరిసరాల్లో మురుగు


