హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యానాంలో రికార్డు ధరకు పులస చేప

కోనసీమ: యానాం రేవులో 1.3 కిలోల మగ పులస రూ.24 వేలకు అమ్ముడైంది. మరో పులస రూ.7,500కు విక్రయించడంతో రెండు చేపలకు రూ.31,500 పలికింది. ఈ సీజన్‌లో మగ పులసకు ఇదే అత్యధిక ధర అని మత్స్యకారులు తెలిపారు. లభ్యత తగ్గడంతో డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని పేర్కొన్నారు.