హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఊడిజర్ల గ్రామంలో పారిశుధ్య పనులు

పల్నాడు జిల్లా ఈపూరు(M) ఊడిజర్ల గ్రామంలో సుమారు 10 డెంగ్యూ కేసులు నమోదవడంతో వైద్య శిబిరం కొనసాగుతోంది. దోమల నివారణకు మురుగు కాలువల్లో పూడికతీత, లార్వా నివారణకు ఎబెట్‌ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. వైద్య శిబిరాన్ని గ్రామంలో కొనసాగిస్తామని వైద్యాధికారి డాక్టర్‌ హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.