హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

BPT: పిట్టలవానిపాలెం, పంతెనవారిపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చందోలు ఎస్సై కె. మాధవరావు ఆధ్వర్యంలో జిల్లా ఈగల్ టీమ్ సభ్యులు విద్యార్థులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ కె. మాధవరావు మాట్లాడుతూ ఎన్‌డీపీఎస్ చట్టం, గంజాయి తదితర మాదకద్రవ్యాలు, దుష్ప్రభావాలు, బాల్య వివాహాల నివారణపై రోడ్డు భద్రతపై విద్యార్థులకు వివరించారు.