హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కత్తెరతో భార్యపై భర్త దాడి

GNTR: భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త కుట్టుమిషన్‌ కత్తెరతో భార్యపై దాడి చేసిన ఘటన ఫిరంగిపురం మండలంలోని తాళ్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. డేగల హరికృష్ణ తన భార్య గాయత్రితో గొడవపడి, ఆగ్రహంతో కుట్టుమిషన్‌ కత్తెరతో ఆమెపై పలుచోట్ల పొడిచి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు శనివారం ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.